చెక్ బౌన్సు కేసులపై సుప్రీం కీలక వ్యాఖ్య

పేరుకు పోయిన చెక్ బౌన్సుల కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. లక్షలాది కేసులు దేశ వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో చెక్ బౌన్సు కేసులు నిలిచిపోవటం సరికాదని పేర్కొంది. దాదాపు 35లక్షల కేసులు పరిష్కారం కాకుండా న్యాయం కోసం కోర్టులో నలిగిపోతున్నాయి. ఇలాంటివేళ.. వీటిని తగ్గించటం కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అనివార్యమన్న అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు పార్లమెంటుకు అధికారం కల్పిస్తున్న రాజ్యాంగంలోని 247వ అధికరణను వినియోగించుకోవాలని కేంద్రానికి చెప్పింది.