నాగుల పహాడ్ లో కొనసాగుతోన్న జాతర

నాగుల పహాడ్ లో కొనసాగుతోన్న జాతర
రచ్చబండ, పెన్ పహాడ్ : పెన్ పహాడ్ మండలం నాగులపహాడ్ జాతర సందడిగా కొనసాగుతోంది. విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం నాగుల పహాడ్ శ్రీ త్రికుంటేశ్వర ఆలయం వద్ద నంద్యాల రవికిరణ్ రెడ్డి- రజిత దంపతులు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఎంపీపీ నెమ్మాది భిక్షం ప్రారంభిచారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ నాతాల జానకి రామ్ రెడ్డి, సూదిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ సంకరమద్ధి నిరంజన్ రెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొండా జానకి రాములు,గంగారపు శ్రీను, ఎగ్గడి మురళి, శ్రవణ్ రెడ్డి, పొట్లపహాడ్ సర్పంచ్ రామినేని కృష్ణయ్య, నిమ్మల ప్రవీణ్, మీసాల దేవయ్య, మేకపోతుల సీతారాములు, ఎల్లంల నగేష్ తదితరులు పాల్గొన్నారు.