చెర్వుగట్టు ఈవోగా సీనియర్ అధికారి నవీన్ బాధ్యతలు

నల్లగొండ : ప్రసిద్ధ చెర్వుగట్టు ఆలయ ఇన్ చార్జి ఈవోగా సిరికొండ నవీన్ నియమితులయ్యారు. ఇక్కడి ఈవో పోస్టు నియామకంపై గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. ఎట్టకేలకు నవీన్ కు ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించడంతో సద్దుమణిగింది.

సీనియర్ అధికారి అయిన సిరికొండ నవీన్ నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని పలు దేవాలయాలకు ఈవోగా వ్యవహరిస్తున్నారు. నిడమనూరు మండలం ఇండ్లకోటయ్యగూడెం గ్రామ పరిధిలోని కోటమైసమ్మ ఆలయ పూర్తిస్థాయి ఈవోగా ఆయన పనిచేస్తున్నారు.

సిరికొండ నవీన్ నిడమనూరు, త్రిపురారం, మిర్యాలగూడ, మాడ్గులపల్లి మండలాలతో పాటు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలాల పరిధిలోని సుమారు 30 ఆలయాలకు ఆయన ఇన్ చార్జి ఈవోగా వ్యవహరిస్తున్నారు. వీటిలో ప్రసిద్ధ మట్టపల్లి ఆలయ ఇన్ చార్జి ఈవోగా కూడా నవీన్ కొనసాగుతున్నారు.