శంకర్ పల్లి ఉపాధ్యాయులకు ‘టీచర్ ఫర్ ఎక్సలెంట్’ అవార్డులు

శంకర్ పల్లి ఉపాధ్యాయులకు ‘టీచర్ ఫర్ ఎక్సలెంట్’ అవార్డులు

రచ్చబండ, శంకర్ పల్లి: విద్యారంగంలో విశేష సేవలందిస్తూ, విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తూ, వృత్తిపట్ల అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులకు అందించే టీచర్ ఫర్ ఎక్సలెంట్ అవార్డును శంకర్ పల్లి మండలంలోని పొద్దుటూరు ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు జంగయ్య, పిల్లిగుండ్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బాలమణి, రేవతి హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ గణేష్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్,  ఇంటర్నేషనల్ గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీచర్స్ డే సెలబ్రేషన్స్ లో ఆదివారం అందుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అడిషనల్  డిజిపి అభిలాష బిష్ట్ గారు, ఐ ఐ హెచ్ ఎం డైరెక్టర్ ఇమ్మానుయేల్ చేతుల మీదుగా టీచర్ ఫర్ ఎక్సలెంట్ అవార్డును ప్రధానం చేశారు.

 

కోకాపేటలోని గ్లోబల్ ఎడ్జ్ పాఠశాలలో నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అభిలాష బిష్ట్, సుబార్నో బోస్ , ఇమ్మానియేల్  మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది అన్ని వృత్తుల కంటే ఎంతో ఉన్నతమైనదని అన్ని వృత్తులలోని వ్యక్తులను తయారు చేసే అవకాశం ఒక ఉపాధ్యాయునికి మాత్రమే దక్కడం గర్వించదగ్గ విషయమని, తల్లిదండ్రుల తర్వాత పిల్లలను ఎక్కువగా ప్రేమించేది ఉపాధ్యాయులేనని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగినపుడు ఎక్కువగా సంతోషించేది ఉపాధ్యాయులేనని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు లు, సామాజిక కార్యకర్త మర్పల్లి అశోక్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.