జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న సూర్యాపేట డీపీఆర్వో

జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న సూర్యాపేట డీపీఆర్వో

– వివక్ష పాటిస్తున్న డీపీఆర్వో, ఇతర అధికారులను సస్పెండ్ చేయాలి
– సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ బంటు కృష్ణ, పాల్వాయి జానయ్య
– అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన

రచ్చబండ, సూర్యాపేట: జర్నలిస్టులకు రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులను కాలరాస్తూ, నియంతలా వ్యవహరిస్తూ, ఏకపక్ష నిర్ణయాలతో వ్యవహరిస్తున్న సూర్యాపేట డీపీఆర్వోను, సమాచార శాఖ ఇతర అధికారులను కూడా సస్పెండ్ చేయాలని జర్నలిస్టు నేతలు పిలుపునిచ్చారు.

శనివారం సూర్యాపేటలో జరిగిన మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మాన సమావేశాల విషయంలో మున్సిపల్ కార్యాలయంలోకి జర్నలిస్టులను అనుమతించే విషయంలో సమాచార శాఖ అధికారులు వివక్షను ప్రదర్శించారని నిరసన వ్యక్తం చేశారు. యూనియన్లకు అతీతంగా శనివారం సూర్యాపేట రైతు బజార్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ బంటు కృష్ణ, పాల్వాయి జానయ్య మాట్లాడారు.

చిన్న పత్రికలు పెద్ద పత్రికలు, చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అంటూ విలేకరుల మధ్య డీపీఆర్వో తగాదాలు సృష్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు అంటూ జిల్లా ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించారని, విలేకరులను అనుమతించే విషయంలో ఎలక్షన్ కమిషన్ రూల్స్, జీవోలు ఉంటే వెంటనే బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు.

సూర్యాపేట సమాచార శాఖ కార్యాలయంలో జరిగిన, జరుగుతున్న అవినీతి అక్రమాల విషయంలో సోమవారం జరగనున్న గ్రీవెన్స్ లో ఫిర్యాదు అందించి అనంతరం జరిగే ధర్నాకు యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు కదలి రావాలని వారు పిలుపునిచ్చారు. తదుపరి రాష్ట్రవ్యాప్త కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైదరాబాదులో ప్రజాపాలన కార్యక్రమంలో ఫిర్యాదుతోపాటు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కి, సమాచార శాఖ అధికారులకు, జిల్లా మంత్రులకు, స్థానిక శాసనసభ్యులకు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కి ఫిర్యాదులు అందజేయనున్నట్లు వారు వెల్లడించారు.

ఈ నిరసన కార్యక్రమంలో విలేకరులు కొండ్లే కృష్ణయ్య, ఉయ్యాల నరసయ్య, పుట్ట రాంబాబు, తండు నాగేందర్, రాచకొండ రామచంద్ర రాజు, ఎస్కే చాంద్ పాషా, సతీష్, దుర్గం బాలు, ప్రభు, కొరివి సతీష్ తదితరులు పాల్గొన్నారు