Bjp leader thulasidas.. విద్యార్థులు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి

  • బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ నేత వర్రీ తులసీరామ్ విజయకుమార్

రచ్చబండ, శంకర్ పల్లి: రాబోయే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు భయం వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ నేత వర్రీ తులసీరామ్ విజయ్ కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా ప్యాడ్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవతో విద్యను అభ్యసించాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు బాగా చదివి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు.

ఏప్రిల్ 3 నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి విద్యార్థుల పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ శంకర్ పల్లి మండల అధ్యక్షుడు బసగళ్ల రాములుగౌడ్, తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ టీఎస్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నివాస్, రాజశేఖర్ రెడ్డి, గణేష్, ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.