BJP Shankerpally Mandal.. బీజేపీ శంకర్ పల్లి మండల ఉపాధ్యక్షుడిగా శశికాంత్ రెడ్డి

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల బీజేపీ ఉపాధ్యక్షుడిగా మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన బొల్లారం శశికాంత్ రెడ్డిని నియమించినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు బసగాళ్ల రాములుగౌడ్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి శశికాంత్ రెడ్డిని మండల బీజేపీ మండల ఉపాధ్యక్షుడిగా నియమించామని తెలిపారు.

ఇచ్చిన పదవిని కాపాడుకుంటూ పార్టీ బలోపేతానికై పాటుపడాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా శశికాంత్ రెడ్డి మండల బిజెపి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇంచార్జ్ రాజా చంద్ర, టంగుటూరు గ్రామ బిజెపి నాయకులు నర్సింహారెడ్డి, అందేలా సాయికుమార్, బద్దం రాఘవేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సిహెచ్.కృష్ణ, బద్దం బుచ్చిరెడ్డి,  ఎస్ఎంఐటీ సెల్ లీడర్ బద్దం శశికాంత్ రెడ్డి, పొద్దుటూరు గ్రామ నాయకులు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.