విజయ సంకల్ప సభలో మోడీ పూర్తి ప్రసంగం

రచ్చబండ : హైదరాబాద్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప్ సభలో ప్రధాని మోడీ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. జనం జేజేల నడుమ ఆయన ప్రసంగం ఆసాంతం కొనసాగింది. సభికులు అడుగడుగునా మోడీ.. మోడీ.. అని నినదిస్తూ డప్పు చప్పుళ్లు చేస్తూ ప్రసంగానికి మద్దతు తెలిపారు.

సభకు జనం పెద్ద ఎతున తరలివచ్చారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన సాయాన్ని, అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించ లెక్కలతో సహా ప్రధాని వివరించారు. మోడీ ప్రసంగ పాఠం పూర్తిగా పాయింట్ల వారీగా మీకోసం.

తెలంగాణ యావత్తు ప్రజానీకం ఈ సభలోనే ఉన్నట్లుంది.
తెలంగాణ ప్రజలందరికీ కేంద్రం పథకాలు అందుతున్నాయి.
తెలంగాణ గడ్డకు శిరసు వంచి నమస్కరిస్తున్నా.
తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారు కోరుకుంటున్నారు.
తెలంగాణ ప్రజలకు బీజేపీపై విశ్వాసం పెరుగుతోంది. బీజేపీ ప్రభుత్వం కోరుతూ ప్రజలు నిర్ణయించుకున్నారు.
2019 నుంచి అంతకంతకూ మాకు మద్దతు పెరుగుతోంది.
హైదరాబాద్ అన్నింటికీ శక్తినిస్తుంది.
తెలంగాణ ఓ పుణ్యస్థలం. తెలంగాణ పరాక్రమానికి నిదర్శనం. తెలంగాణ శిల్పకళ మనకు గర్వకారణం. తెలంగాణ అభివృద్ధే మా ప్రథమ ప్రాధాన్యం.
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి

బీజేపీకి పెరిగిన ఆదరణ
• తెలంగాణ ప్రజలు గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఆదరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలిచ్చారు.
• తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చాం.
• గత ఆరేళ్లలో లక్ష కోట్ల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది.
• తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు నిర్మించాం.
• రాష్ట్రంలో జాతీయ రహదరాలకు భారీగా నిధులు ఇచ్చాం.

దేశ అభ్యున్నతికి విశేష కృషి
• కరోనా కష్టకాలంలో ప్రజలకు మేలు చేశాం.
• దేశవ్యాప్తంగా మహిళా సాధికారత సాధిస్తున్నారు.
• ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోంది.
• బడుగు, బలహీన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది.
• దశాబ్దాల నుంచి వంచనకు గురైన వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నాం.
• ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికి మంచి చేసే ప్రయత్నం చేశాం.

హైదరాబాద్.. అత్యున్నతం
• హైదరాబాద్ లో అత్యాధునికి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశాం.
• హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉంది.
• రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాం.
• తెలంగాణ 5 నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తుంది.
• రూ.350 కోట్లతో హైదరాబాద్కు మరో రీజినల్ రింగ్ రోడ్డు మంజూరు చేశాం.
• బయో మెడికల్ సైన్సెస్ కంద్రాలు ఏర్పాటవుతున్నాయి.
• తెలంగాణలో కళ, కౌశలం పుష్కలంగా ఉన్నాయి.
• తెలంగాణలో మెగా టెక్స్ టైల్స్ పార్కును ఏర్పాటు చేస్తాం.

• సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ పేర్లు ప్రస్తావించక పోవడం గమనార్హం. రాజకీయ విమర్శలకు ప్రధాని మోడీ తావివ్వలేదు.