జర్నలిజానికే వన్నె తెచ్చిన డాక్టర్ బంటు కృష్ణ

* జర్నలిజంలో బంగారు పతకాన్ని సాధించడం అభినందనీయం
* జర్నలిస్టులకు అయన ఆదర్శప్రాయడు
* కొనియాడిన ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని
* టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బంటు కృష్ణకు ఘన సన్మానం

సూర్యాపేట, రచ్చబండ: టీయూడబ్ల్యూజే ఐజేయూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత డాక్టర్ బంటు కృష్ణ జర్నలిజానికే వన్నె తెచ్ఛారని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చలసాని శ్రీనివాసరావు కొనియాడారు. ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పీహెచ్ డీ పూర్తైన సందర్భంగా గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ చేతుల మీదుగా కృష్ణ బంగారు పథకాన్ని అందుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో టిటీయూడబ్ల్యూజే (ఐజేయూ) సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ కృష్ణకు పూలే బొకేలు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంచారు.

ఈ సందర్భంగా చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్థికంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని పట్టు వదలని విక్రమార్కుడిలా, సీనియర్ జర్నలిస్టు గా మూడు దశాబ్దాలుగా పైగా జర్నలిజం రంగం లో రాణిస్తూ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పూర్తి చేయడం ఎంతో గర్వకారణమని తెలిపారు. జర్నలిజాన్నే ఒక వృత్తిగా భావిస్తూ, అనేక జాతీయ, అంతర్జాతీయ కథనాలు రాస్తూ సమాజాన్ని జాగృతం చేయడంలో ఎంతో శ్లాఘనీయమని చెప్పారు. తోటి సహచర జర్నలిస్టులకు బంటు కృష్ణ ఆదర్శప్రాయులని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తనను సన్మానించిన అందరికీ పేరుపేరునా బంటు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి మోతే మండల విలేకరులు పల్లెల లక్ష్మణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బంటు కృష్ణను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సీనియర్ జర్నలిస్టు మిక్కిలినేని శ్రీనివాసరావు, ఎలక్ట్రాన్ మీడియా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బత్తుల మల్లికార్జున్, రెబ్బ విజయ్ కుమార్, టీఎస్ జేఏ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ లు సుంకర బోయిన వెంకటయ్య, కొండా శ్రీనివాసరావు, ఏబియన్ మల్లేష్, కందుల నాగరాజు, ఉయ్యాల నర్సయ్య, గోపన బోయిన రవి, కొండ్లె కృష్ణయ్య, వాసా చంద్ర శేఖర్, అమృనాయక్, రవి, రమేష్, వేల్పుల ప్రవీణ్, రామచంద్ర రాజు, జహీర్, బాలు, ప్రభాకర్, శంకర్, అనీల్, శంకర్, లక్ష్మణ్, సుమన్, రాము తదితరులు పాల్గొన్నారు.