కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన చేవెళ్ల నేత తొండ రవి

రచ్చబండ, శంకర్ పల్లి; శంకర్ పల్లి మండలం మహరాజ్ పేట్ గ్రామ మాజీ ఉప సర్పంచ్, చేవెళ్ల నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ సభ్యులు తొండ రవి బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తొండ రవి మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.