BJP Leader Thonda Ravi.. వచ్చే ఎన్నికల్లో చేవెళ్లలో బీజేపీ గెలుపు ఖాయం

  • రాష్ట్రంలో బీజేపీదే అధికారం
  • కేంద్ర పథకాలను ఇంటింటికీ చేరవేయాలి
  • బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ నాయకుడు తొండ రవి
  • దొంతన్ పల్లి నుంచి శంకర్ పల్లి వరకు బైక్ ర్యాలీ

రచ్చబండ, శంకర్ పల్లి : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ  నాయకుడు తొండ రవి జోస్యం తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం దొంతన్ పల్లి నుండి శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో వివిధ కాలనీలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి గ్రామంలో ఇంటింటికీ చేరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరైనా వాటిని ప్రజల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లడం లేదని, ప్రతి బీజేపీ కార్యకర్త నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను యువత ప్రతి ఒక్కరితోపాటు తమ కుటుంబంలో చెబితే ప్రతి ఒక్కరికీ అవగాహన వస్తుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంటింటికీ ఒక ఉద్యోగం అని చెప్పి ఇప్పటివరకు ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదని  ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ చేయకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. త్వరలో నియోజకవర్గ సమస్యల పట్ల పోరాడుతానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.