Bheem Bharath.. విద్యార్థులు ఇష్టపడి చదివి విజేతలు కావాలి

Bheem Bharath.. విద్యార్థులు ఇష్టపడి చదివి విజేతలు కావాలి

* కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జి భీమ్ భరత్

రచ్చబండ, శంకర్ పల్లి: విద్యార్థులు ఇష్టపడి బాగా చదువుకొని తమ జీవితాలను సార్థకం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జి పామెన భీమ్ భరత్ పిలుపునిచ్చారు. శనివారం శంకర్ పల్లి మండలంలోని దొంతంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కరోనా కిడ్స్, నోట్ బుక్కులు, స్కూల్ బ్యాగులు, నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలు అధికంగా చదువుకుంటున్నారని అలాంటి వారికి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులకు ఈ వస్తువులు పంపిణీ చేసిన దొంతంపల్లి గ్రామానికి చెందిన దాత ఎండీ అజీజ్ ను అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిసిసిపి కార్యదర్శి ఉదయ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శంకర్ పల్లి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, మైనార్టీ నాయకులు ఎండీ అజీజ్, గ్రామ సర్పంచ్ అశ్విని సుధాకర్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు మొహమ్మద్, నాయకులు మహబూబ్ హుస్సేన్, షరు, బద్దం కృష్ణారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.