నేను మతతత్వ వాదినే.. కుండ బద్ధలు కొట్టేశాడు

మొహమాటాలు లేవు. ఎవరు ఏం అనుకుంటారన్న శంక లేదు. నేను చేసేదే చెబుతా. నా వరకు నేనే నిజాయితీగా ఉంటా. మీరేం అనుకున్నా సరే.. నా గురించి నేనే క్లియర్ గా చెబుతా. ఓట్ బ్యాంకు రాజకీయాలు వద్దు.. సింఫుల్ గా సూటిగా విషయాన్ని చెప్పేస్తా అన్న రీతిలో.. ఇప్పటివరకు ఏ రాజకీయ నేత చెప్పలేని విషయాన్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుండ బద్ధలు కొట్టేశాడు. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి హాజరైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.