రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపురం శివారులో వెలసిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో 14వ వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ఎల్.మురళీకృష్ణ తెలిపారు.
ఆదివారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 11 గంటలకు సీతారామ కళ్యాణం జరుగుతుందని చెప్పారు. రథోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన వితరణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.