టిప్పర్ ఢీకొని వ్యక్తి యువకుడి దుర్మరణం

టిప్పర్ ఢీకొని వ్యక్తి యువకుడి దుర్మరణం

రచ్చబండ, శంకర్ పల్లి: టిప్పర్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. స్థానిక ఎస్సై సంతోష్ రెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శంకర్ పల్లి పట్టణానికి చెందిన జొన్నాడ అనిల్ గౌడ్(30) రోజు మాదిరిగా వ్యాపార పని నిమిత్తం మున్సిపల్ పరిధిలోని రామంతపురం కు వెళ్లారు. కాగా తిరుగు ప్రయాణంలో వెనక నుండి టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అనిల్ గౌడ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.