శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ కు జిల్లా ఉత్తమ అవార్డు

శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ కు జిల్లా ఉత్తమ అవార్డు

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న వెంకయ్య గౌడ్ కు ఉత్తమ ఎంపీడీవో అవార్డు లభించింది. శుక్రవారం హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకయ్య గౌడ్ మాట్లాడుతూ అవార్డు రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగింది అన్నారు. మండలంలోని ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ ప్రీతం సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.