Shankerpally Reporter.. శంకర్ పల్లి అయ్యప్ప ఆలయానికి లక్ష విరాళం

  • కమిటీ సభ్యులకు అందజేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి శ్రీనివాస్

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని హైదరాబాద్ రోడ్డు పక్కన నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప ఆలయానికి శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామానికి చెందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేఖరి ఎం.శ్రీనివాస్- అన్నపూర్ణ దంపతులు లక్ష రూపాయలు విరాళాన్ని దేవాలయ కమిటీ సభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోనే ప్రథమంగా భారీగా అయ్యప్ప దేవాలయాన్ని స్థానిక భక్తులు నిర్మిస్తున్నారని తెలిపారు. అందుకు తన వంతుగా లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం తన భాగ్యంగా భావిస్తున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ భానూరు వెంకటరామిరెడ్డి, అయ్యప్ప మాలధారులు దండు మోహన్, సాతా ప్రవీణ్ కుమార్, కె.శ్రీనివాస్, అడ్వకేట్ విశ్వేశ్వర్, జూలకంటి పాండురంగారెడ్డి, కె.జంగయ్య, బద్దం భరత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.