Bheem Bharath.. కాంగ్రెస్ మరింత బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి

Bheem Bharath.. కాంగ్రెస్ మరింత బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి

* చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పామేనా భీమ్ భరత్

రచ్చబండ, శంకర్ పల్లి: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు మరింత కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జ్ పామెన భీమ్ భరత్ పిలుపునిచ్చారు. రంగరీది జిల్లా శంకర్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విస్తృతస్థాయి సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల గురించి ప్రజలకు తెలియచేయాలన్నారు. అర్హులైన వారికి ఈ పథకాలు అందేలా చూడాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి, రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ చింపుల సత్యనారాయణ రెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, శంకర్ పల్లి మాజీ సర్పంచ్ వై. ప్రకాష్ గుప్తా, పలు గ్రామాల సర్పంచులు, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.