19న జరిగే మహా ధర్నాను విజయవంతం చేయండి

19న జరిగే మహా ధర్నాను విజయవంతం చేయండి
* తపస్ శంకర్ పల్లి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జంగయ్య, శ్రీను
రచ్చబండ, శంకర్ పల్లి: తపస్ శంకర్ పల్లి మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య, శ్రీను ఆధ్వర్యంలో బుధవారం శంకర్ పల్లి మండలంలోని వివిధ పాఠశాలల్లో మహా ధర్నా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జంగయ్య, శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు, విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీని నియమించి, 20 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలని, ప్రతి పాఠశాలలో స్కావెంజర్ ను నియమించాలని, బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని కోరారు.

అదే విధంగా టెట్ తో పాటు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ ఏరియాస్ ను, డీఏ ఏరియాస్ ను ఓకే విడత లో చెల్లించాలని, పండిత్ పీఈటీ అప్ గ్రేడేషన్, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, కేజీబీవీ ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం మరియు ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఎంటీఎస్ కొరకు తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, విద్యా రంగ మరియు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తపస్ నిరంతరం ఉద్యమాలు చేస్తుందని చెప్పారు.

ఈనెల 19న ఇందిరాపార్క్ వద్ద తపస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ధర్నా లో అధిక సంఖ్యలో ఉపాధ్యాయిని మరియు ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేయాలని కోరారు… కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర మరియు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.