సూర్యాపేట సమగ్రాభివృద్ధే ధ్యేయం

  • మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ

సూర్యాపేట : పట్టణ సమగ్రాభి వృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ల అన్నపూర్ణ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యాచరణ ద్వారా సూర్యాపేట రుపు రేఖలు మారుతాయని అన్నారు. పట్టణ ప్రగతి కార్యాచరణలో భాగంగా చేపట్టిన హరిత హరం కార్యక్రమంలో సోమవారం ఆమె స్థానిక 9వ వార్డులో పాల్గొన్నారు. పారిశుధ్య పనులను మొదలు పెట్టి, పర్యటిస్తూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సూచించారు. కలసికట్టుగా ముందడుగు వేసి, చెత్త రహిత వార్డు గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అనంతరం వార్డు లో జేసీబీ ద్వారా పరిశుభ్రతా పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రసాద్, బిక్షం నాయక్, మధు, కమృద్దీన్ తదితరులు పాల్గొన్నారు.