వృత్తిదారులు యజమానులు కావాలన్నదే కేసీఆర్ ధ్యేయం

వృత్తిదారులు యజమానులు కావాలన్నదే కేసీఆర్ ధ్యేయం

* కులవృత్తులకు జీవం పోసిన ముఖ్యమంత్రి
* హుజుర్ నగర్ నియోజకవర్గంలో ఇంటింటికీ సంక్షేమం
* కుల వృత్తిదారులకు బీసీ బంధు చెక్కులు అందజేత
రచ్చబండ, హుజుర్ నగర్: వృత్తిదారులు కార్మికులుగానే మిగిలిపోకుండా యజమానులుగా మార్చి వారిలో సీఎం కేసీఆర్ ఆత్మాభిమానం నింపుతున్నారని హుజర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజర్నగర్ లోని నూతన క్యాంపు కార్యాయంలో గురువారం జరిగిన బీసీ బంధు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అయన ముఖ్య అతిధి గా హాజరై ప్రసంగించారు. తమ చేతుల మీదుగా నియోజకవర్గంలోని లబ్ధిదారులు అందరికీ లక్ష రూపాయల చెక్కులను అందించారు.

 

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నిరుపేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ఈ పధకం ద్వారా అభివృద్ధి చెందాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా భావించి ముందుకు తీసుకుని పోతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఎన్నో రాష్ట్రాలు తెలంగాణలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలను అనుసరిస్తూ ఉన్నారాణి చెప్పారు.

గతంలో కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని ధ్వజమెత్తారు. మళ్లీ ఆ పార్టీకి ఓటేస్తే ప్రజల జీవితాలు చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విజ్ఞప్తి చేశారు. నేడు హుజర్నగర్ నియోజకవర్గం ప్రతి రంగంలో దూసుకు పోతుందని, 70 ఏళ్ల అభివృద్ధిని కేవలం మూడున్నర సంవత్సరాల్లో చేసి చూపించామని, మౌలిక రంగాల రూపకల్పన, ప్రభుత్వ సంస్థల ఏర్పాటు, ప్రజా సంక్షేమం మీద రాత్రిపగలు ఆకుపెరగకుండా పని చేస్తున్నామని తెలిపారు.

నియోజకవర్గములోని 7 మండలాలు, 2 మ్యూనిసిపలిటీలలోని 280 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయల చెక్కులను అందించడం జరుగుతుందని, త్వరలో రెండో విడత కూడా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమములో నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు బీసీ కార్పోరేషన్ జిల్లా అధికారులు, మండల అధికారులు, ఎంపీడీఓలు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు