విద్యార్థులకు కథల పుస్తకాలు,నోటు పుస్తకాల పంపిణీ

రచ్చబండ, శంకర్ పల్లి :

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాల శేరిగూడలో సోమవారం గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా, స్వర్గీయ శ్రీ పెంటయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వీరమణి,సంతోష్ కుమార్, మరియు సామాజిక కార్యకర్త ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ తో కలిసి,కొండకల్ క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు అత్వెల్లి విద్యాకర్ సమక్షంలో విద్యార్థులకు కథల పుస్తకాలు,నోటు పుస్తకాలు,పెన్నులు,పెన్సిల్లు,ఎరాజర్,కంబాక్సులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా క్లస్టర్ హెచ్ఎం విద్యాకర్, మరియు అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి దాతలు ముందుకు వచ్చి విద్యార్థుల అవసరాలను తెలుసుకొని, సందర్భానుసారం వారికి కావలసినటువంటి పఠన సామాగ్రిని అందించడం అభినందనీయమని, విద్యార్థులు పుస్తకాలను నిరంతరం చదవడంవలన పఠన నైపుణ్యం మెరుగుపడటంతో పాటు, పుస్తకంలోని సారాంశాన్ని గ్రహించి,కథలలోని నీతిని, మంచి చెడులను తెలుసుకొని సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకోగలుగుతారని, అందుకోసం విద్యార్థులు చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ గౌడ్,ఉపాధ్యాయులు రాముశర్మ,ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాస్ మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.