వాహ్.. శభాష్!

ఈ ఫొటోను నిశితంగా పరిశీలించండి. ఇది ఇతరుల్లో స్ఫూర్తిని నింపే అరుదైన చిత్రం. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు సిగ్నల్ వద్ద నిలిచాయి. ఒక్క వాహనం కూడా రోడ్డు మధ్యలో ఉన్న గీతను దాటే ధైర్యం చేయలేదు.

ఒకరి వెనుకాల ఒకరు వాహనాలను నిలిపి వేచి ఉన్నారు. త్వరగా వెళ్లాలనే ఆతృత కానీ, హడావుడి కానీ ఏ ఒక్కరిలోనూ లేదు. ఇది వారిలో ఉన్న క్రమశిక్షణకు నిదర్శనం. అందరూ ఇలాంటి గీత దాటకుండా ఉంటే అందరూ సేఫ్ గా ఉంటారనడానికి ఇదో నిదర్శనం.

ఇది మిజోరాం నగరంలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వద్ద క్రమశిక్షణతో వాహనదారులు క్యూలో ఉన్న విధానాన్ని ప్రశంసిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఒక్కరు కూడా రోడ్డు మధ్యలోని గీతను దాటలేదని, ఇదెంతో అద్భుతమైన చిత్రమని ఆయన పేర్కొన్నారు. మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక మంచి సందేశమని ఆయన తెలిపారు.